కేంద్రమే పోలవరం ప్రాజెక్ట్ కట్టాలి :సోమిరెడ్డి

by సూర్య | Sat, Aug 24, 2019, 06:44 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షనేత చంద్రబాబుకు మంచిపేరు వస్తుందని ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణం జరగాలని కోరారు. కక్ష సాధింపుతో రివర్స్‌ టెండరింగ్‌ వంటి నిర్ణయాలు మంచివి కాదని హితవుపలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. 70 శాతానికి పైగా పనులు పూర్తయిన ప్రాజెక్టును ఆపడం సరికాదన్నారు. అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి వంటి పథకాలు ఆపినట్టు పోలవరం ప్రాజెక్టును ఆపడం శ్రేయస్కరం కాదన్నారు.


 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM