by సూర్య | Sat, Aug 24, 2019, 06:44 PM
ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షనేత చంద్రబాబుకు మంచిపేరు వస్తుందని ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణం జరగాలని కోరారు. కక్ష సాధింపుతో రివర్స్ టెండరింగ్ వంటి నిర్ణయాలు మంచివి కాదని హితవుపలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. 70 శాతానికి పైగా పనులు పూర్తయిన ప్రాజెక్టును ఆపడం సరికాదన్నారు. అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి వంటి పథకాలు ఆపినట్టు పోలవరం ప్రాజెక్టును ఆపడం శ్రేయస్కరం కాదన్నారు.
Latest News