by సూర్య | Sat, Aug 24, 2019, 01:47 PM
ఈ-కేవైసీ ఇక్కట్లపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అదనపు కౌంటర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. రేషన్కు ఆధార్ అనుసంధానం చేయడంతో మీ సేవా కేంద్రాల దగ్గర ప్రజలు బారులు తీరారు. గంటల తరబడి క్యూలో నిలబడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కౌంటర్ల దగ్గర ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా సర్కార్ను మాజీ సీఎం కోరారు.
Latest News