ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రచారంపై కమిటీ
by సూర్య |
Fri, Aug 23, 2019, 10:07 PM
తిరుమల క్షేత్రంలో అన్యమతాల ప్రచారంపై నిషేధం ఉన్న నేపథ్యంలో.. తిరుమల కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన ప్రకటనలు దర్శనమివ్వడంతో ఆ ఫొటోలను సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. చివరికి జగన్కి జై కొట్టిన స్వరూపానందేంద్ర స్వామి సైతం సమగ్ర దర్యాప్తు జరిపి బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయటంతో ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది.
Latest News