అప్పుడు 'కడతాం' అని.. ఇప్పుడు 'కొడతాం' : లోకేష్ ట్విట్

by సూర్య | Fri, Aug 23, 2019, 04:16 PM

నిన్న విజయనగరంలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసిన ఘటనపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నారా లోకేశ్ స్పందిస్తూ, ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ‘మీరు చదువుకోండి ఫీజులు మేము 'కడతాం' అని ప్రచారం చేసుకున్న జగన్, ఇప్పుడు ఫీజులు అడిగితే 'కొడతాం' అంటున్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించమంటూ మూడు గంటలు మండుటెండలో నిరసన చేసినా విద్యార్థుల సమస్యలు వినే తీరిక ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులను లాఠీలతో చావబాదుతారా? గిరిజన సంక్షేమగృహాల్లో వసతులు పెంచమని కోరడమే తప్పా? ప్రభుత్వానికి గిరిజన సంక్షేమం మీద ఉన్న శ్రద్ధ ఇదేనా? మాటలు చెప్పడం కాదు, చేసి చూపండి. వెంటనే రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు తీర్చండి’ అని జగన్ ని డిమాండ్ చేశారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM