ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను: పవన్ కళ్యాణ్

by సూర్య | Thu, Aug 22, 2019, 08:29 PM


 


బిగ్ బి అమితాబ్ పై ప్రశంసల జల్లు కురిపించారు జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కళ్యాణ్. అమితాబ్ బచ్చన్ అంటే తనకు ఎంతో ఇష్టమని పదేపదే చెప్పే పవన్ సైరా నరసింహారెడ్డి సినిమా సెట్స్ లో కలిశారు. 
బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తో కలిసి పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్.  
అమితాబ్ తో దిగిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్న పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నా ఆరాధ్యమూర్తి అమితాబ్‌ బచ్చన్‌ని ‘సైరా’ సెట్స్‌లో కలిశాను. ఎన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని ఆయన జీవితం మనకు నేర్పుతుందంటూ చెప్పుకొచ్చారు. 
ఇకపోతే సైరా సినిమాకు పవన్‌ కళ్యాణ్ వాయిస్‌ ఓవర్‌ అందించిన సంగతి తెలిసిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ మెగాస్టార్ చిరంజీవికి గురువుగా కీలక పాత్ర పోషించారు. అక్టోబర్‌ 2న ఈచిత్రం విడుదల కానుంది. 



 


Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM