by సూర్య | Thu, Aug 22, 2019, 07:09 PM
అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వాషింగ్టన్ డీసీ నుండి చికాగోకు పయనమయ్యారు. ఈ సందర్భంగా డీసీకి చెందిన స్థానిక ప్రవాసులు జగన్కు ఘనంగా వీడ్కోలు పలికారు. గొలుగూరి శ్రీనివాస త్రిమూర్తి రెడ్డి కుటుంబ సభ్యులు జగన్కు అమెరికా క్యాపిటల్ నమూనాను జ్ఞాపికగా బహుకరించారు. తన పర్యటన విజయవంతం కావడానికి సాయపడిన డీసీ ప్రవాసులకు జగన్ ధన్యవాదాలు తెలిపారు.
Latest News