భారత్లో బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం అందచేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ కు అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ పదిలక్షల అమెరికన్ డాలర్లు (సుమారు రూ.7.14 కోట్లు) విరాళాన్ని ప్రకటించింది. భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విస్టా, సంబంధిత భాగస్వామ్య సంస్థల తరపున అక్షయ పాత్ర ఫౌండేషన్కు ఈ మొత్తాన్ని అందించనున్నారు.