అమరావతిని మారిస్తే ఉద్యమం

by సూర్య | Thu, Aug 22, 2019, 05:43 PM


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని మారిస్తే రాష్ట్రంలో లక్షలాది మంది రోడ్లమీదకు వస్తారనీ, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం వెల్లుబుకుతుందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిని భమ్రరావతిగా మార్చేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాజధానిని మారిస్తే తెలుగుదేశం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం శంఖుస్థాపన చేసిన అమరావతిని ఎలా మారుస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతుంటే ముఖ్యమంత్రి జగన్‌ అమెరికా పర్యటనలో ఎంజాయ్‌ చేస్తున్నారని అన్నారు. ప్రజలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేయటం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.




 


 


 



Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM