అమరావతి నుంచి తరలించేందుకు కుట్ర : వర్ల రామయ్య

by సూర్య | Thu, Aug 22, 2019, 05:40 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతి నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై స్పందించిన.. రాజధానిని మార్చేందుకు జగన్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ సాయం తీసుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ నోటి వెంట ఎప్పుడూ అమరావతి పేరే రాలేదని, ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా జగన్‌ వ్యవహారం ఉందని ఆరోపించారు. రాజధానికి నిధులు వద్దని ఢిల్లీలోనూ సీఎం చెప్పారని, గుంటూరు, కృష్ణా ప్రజలపై జగన్‌కు కక్ష ఎందుకని ప్రశ్నించారు. ఏపీలో ఓ కులాన్ని దెబ్బతీసేందుకు జగన్‌ ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM