by సూర్య | Thu, Aug 22, 2019, 05:28 PM
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం లొంగిపోయి ఉంటే హుందాగా ఉండేదని బిజెపి ఎంపీ సత్యపాల్ సింగ్ అన్నారు. చిదంబరం దేశ రాజకీయాల్లో ఆయన ఎన్నో బాధ్యతలు చేపట్టారని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను నమ్మలేకపోతున్నానని ఆయన అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన సత్యపాల్ సింగ్ కేంద్ర హోం మంత్రిగా, ఆర్థిక మంత్రిగా చిదంబరం ఎంతో సేవ చేశారని, కోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత లొంగిపోయి ఉంటే గౌరవాన్ని కాపాడుకునే వారని అన్నారు.
Latest News