by సూర్య | Thu, Aug 22, 2019, 04:27 PM
ఆంధ్రప్రదేశ్లో రద్దుల ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ నేత మాణిక్యాలరావు ఆరోపించారు. ప్రత్యామ్నాయ వ్యవస్థను చూడకుండా ప్రతీది రద్దు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెండు నెలల నుంచి దివాలాకోరు దశ కన్పిస్తోందని చెప్పారు. బెదిరించడం ద్వారా లాలూచీకి శ్రీకారం చుడుతున్నారన్నారు. పోలవరం, ఇతర ప్రాజెక్టుల్లో అవినీతిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య రహస్య ఒప్పందాలేమున్నాయని నిలదీశారు. ఏపీలో మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనబడుతోందన్నారు. ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తే సమాజం తిరగబడుతుందన్నారు.
Latest News