బెదిరించడం ద్వారా లాలూచీకి శ్రీకారం : మాణిక్యాలరావు

by సూర్య | Thu, Aug 22, 2019, 04:27 PM

ఆంధ్రప్రదేశ్‌లో రద్దుల ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ నేత మాణిక్యాలరావు ఆరోపించారు. ప్రత్యామ్నాయ వ్యవస్థను చూడకుండా ప్రతీది రద్దు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెండు నెలల నుంచి దివాలాకోరు దశ కన్పిస్తోందని చెప్పారు. బెదిరించడం ద్వారా లాలూచీకి శ్రీకారం చుడుతున్నారన్నారు. పోలవరం, ఇతర ప్రాజెక్టుల్లో అవినీతిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య రహస్య ఒప్పందాలేమున్నాయని నిలదీశారు. ఏపీలో మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనబడుతోందన్నారు. ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తే సమాజం తిరగబడుతుందన్నారు.

Latest News

 
ఒంగోలు పార్లమెంట్ కు నామినేషన్ వేసిన క్రాంతి కుమార్ Fri, Apr 19, 2024, 02:54 PM
రేపు నామినేషన్‌ వేయనున్న బగ్గు రమణమూర్తి Fri, Apr 19, 2024, 02:53 PM
మాడుగులలో బండారుకి సీటు ఖరారు Fri, Apr 19, 2024, 02:51 PM
ఇంకా మార్పులు చేసే ఆలోచనలో టీడీపీ Fri, Apr 19, 2024, 02:51 PM
నేడు పలాసలో నామినేషన్ ధాఖలు చేయనున్న గౌతు శిరీష Fri, Apr 19, 2024, 02:50 PM