by సూర్య | Wed, Aug 21, 2019, 08:54 PM
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన సిల్వర్ కోటెడ్ రాగి రేకులు ఆగస్టు 29న టెండర్ కమ్ వేలం వేయనున్నారు. బుధవారం ఇందుకు సంభందించిన ప్రకటనని తి.తి.దే ప్రజాసంబంధాల అధికారి విడుదల చేశారు.
ఇందులో సిల్వర్ కోటెడ్ రాగి రేకులు ( ఒక్కోక్క లాట్లో 200 కేజిలు) -25 లాట్లు వేలానికి ఉంచామని., ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టిటిడి మార్కెటింగ్ కార్యాలయం (వేలర) 0877-2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో, టిటిడి వెబ్సైట్ www.tirumala.org / www.mstcecommerce / www.mstcindia.co.in సంప్రదించాలని తెలిపారు.
Latest News