by సూర్య | Wed, Aug 21, 2019, 05:58 PM
బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ మహిళా నేత దివ్యవాణి కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో తాను బీజేపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తుదిశ్వాస వరకూ తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. కష్ట కాలంలో పార్టీలో ఉన్నవారే నిజమైన నాయకులని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.