రాజధానిని ఇడుపులపాయ తీసుకెళ్తారా: దేవినేని ఉమా మహేశ్వరరావు

by సూర్య | Wed, Aug 21, 2019, 05:32 PM

మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు రాజధానిని ఇడుపులపాయ తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని.. రాజధాని మార్పు కోసం వరదలను మళ్లించి రైతులను ముంచేశారన్నారు. ప్రభుత్వ అసమర్ధతను కప్పిపుచ్చేందుకు రాజధాని మార్పు అనే డ్రామాను మొదలుపెట్టారని, జగన్ సీఎం అయ్యాక అభివృద్ధి పనులు ఒక్కటంటే ఒక్కటి సక్రమంగా చేస్తున్నారా అని ప్రశ్నించారు. కృష్ణపట్నంపోర్టు కొట్టేయాలని చూశారు.. అది కుదరలేదు. పోలవరం పనులు ఆపేశారు, బందరు పోర్టు నిలిపేశారు. అన్ని ప్రాజెక్టుల పనులను ఆపేశారు. రాజధాని అమరావతిలో గత అసెంబ్లీలో చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఆమోదించి తన వాళ్లకు భూములు కొనుక్కోవాలని పురమాయించారని, ఇప్పుడు అదే రాజధానిని అసమర్ధత కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలు మొదలుపెట్టారన్నారు. రాజధాని విషయంలో కేంద్రానికి రాసిన లేఖలో ఏముందో ప్రభుత్వం చెప్పాలని, రాజధాని మార్పుకు కేంద్రం అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM