by సూర్య | Wed, Aug 21, 2019, 05:20 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మార్చడం అంటే… తుగ్లక్ చర్యేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. అమరావతిలో మంత్రి పెద్దిరెడ్డిని రామకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరతపై ఫిర్యాదు చేశారు. అలాగే ఇసుక ధరలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అలాగే ఇసుక ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఎం రాష్ట్రంలో లేనప్పుడు రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరికాదని రామకృష్ణ అన్నారు.
Latest News