ఇది ప్రభుత్వం సృష్టించిన విపత్తు: చంద్రబాబు

by సూర్య | Wed, Aug 21, 2019, 04:41 PM

రాష్ట్రంలో వచ్చిన వరదలు ప్రభుత్వం సృష్టించిన విపత్తు అని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లాలో కిష్కింధపాలెంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. వరద బాధితులను పరామర్శిస్తున్న సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయన్నారు. ఓ పద్దతి ప్రకారం నీళ్లు వదిలి ఉంటే ఇబ్బంది ఉండేది కాదన్నారు. 50వేల ఎకరాల్లో పంట నీట మునిగిందన్నారు. వరద వచ్చి వారం దాటినా సహాయక చర్యలు చేపట్టలేదన్నారు. రైతుల కోసం టీడీపీ పోరాటం చేస్తుందన్నారు.

Latest News

 
మరోసారి పెద్ద మనస్సు చాటుకున్న సీఎం జగన్ Tue, Apr 16, 2024, 12:52 PM
దాడిని అవహేళన చేసేలా ప్రచారం చేస్తున్నారు Tue, Apr 16, 2024, 12:51 PM
ఓటమి భయంతోనే ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు Tue, Apr 16, 2024, 12:51 PM
నేడు భీమవరంలో సీఎం జగన్ బహిరంగ సభ Tue, Apr 16, 2024, 12:50 PM
పాలకొండ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా Tue, Apr 16, 2024, 12:47 PM