by సూర్య | Wed, Aug 21, 2019, 03:34 PM
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ.. భారత్కు చెందిన ఏరోనాటికల్ ఇంజినీర్ సామియా ఆర్జూను వివాహం చేసుకున్నాడు. దుబాయ్ లోని అట్లాంటిస్ హోటల్లో నిఖా వేడుకను ఘనంగా నిర్వహించారు. కేవలం కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. ఇండియాలో పుట్టి పెరిగిన సామియా ఆర్జూ ప్రస్తుతం దుబాయ్ లో ఉంటోంది. పైలట్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఆమె కొన్నాళ్ల క్రితం అలీకి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లికి దారితీసింది.
Latest News