by సూర్య | Tue, Aug 20, 2019, 10:00 PM
పైసా ఖర్చు కాకుండా అమరావతిని అభివృద్ధి చేద్దామనుకున్నానని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే పనులన్నీ ఆపేశారని, ఏ సీఎం అయినా తన రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటారని, మన సీఎం పక్క రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇక్కడ పెట్టుబడులన్నీ మళ్లీ హైదరాబాద్కే వెళ్లిపోతున్నాయని, పోలవరం పనులు నిలిపేశారు, టెండర్లు రద్దు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. బందరు పోర్ట్ను వైఎస్ ప్రారంభించి పనులు నిలిపివేశారని, తాను బాధ్యతతో పనులు ప్రారంభిస్తే అవి కూడా ఆపేశారని చంద్రబాబు తెలిపారు
Latest News