40 నిమిషాల్లో తిరుమల కొండ ఎక్కిన బుడతడు !

by సూర్య | Tue, Aug 20, 2019, 08:56 PM

కేవలం 40 నిమిషాల్లో తిరుమల కొండ ఎక్కడం అంటే ఎవరికైనా సాధ్యమేనా? సాధారణంగా శారీరక దారుఢ్యం బాగున్నవాళ్లు కూడా కనీసం రెండు గంటల సమయమైనా ఇందుకు తీసుకుంటారు. కానీ, నాలుగేళ్ల బాలుడు కేవలం 40 నిమిషాల్లోనే మొత్తం నడకదారి మార్గాన్ని అధిగమించి కొండపైకి చేరుకున్నాడు. దీంతో అక్కడున్న అధికారులు, భక్తులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.


కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరుకు చెందిన ఎస్. తోనేశ్వర్ సత్య అనే నాలుగేళ్ల బాలుడు తన పుట్టిన రోజైన ఆగస్టు 13వ తేదీ బుధవారం ఈ ఫీట్ సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మూడున్నరేళ్ల వయసు నుంచి సత్య తిరుమల మెట్ల మార్గం ఎక్కడం మొదలుపెట్టాడు. తొలిసారి తన తండ్రి సాయిబాబుతో వచ్చినప్పుడు ఎత్తుకుంటామన్నా వినకుండా దిగి మెట్లు ఎక్కడంతో తల్ల్లిదండ్రులు ఇది దైవకృపగా భావించి అప్పటినుంచి ప్రతి నెలా తీసుకురావడం మొదలుపెట్టారు. తొలిసారి రెండు గంటల 20 నిమిషాల్లో కొండ ఎక్కిన సత్య, అప్పటినుంచి వరుసగా సమయం తగ్గించుకుంటూ వచ్చి, ఈసారి కేవలం 40 నిమిషాల 20 సెకన్లలోనే మెట్లమార్గం ఎక్కేశాడు.

Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM