పార్సిల్ ఆఫీస్ లో రసాయన బాటిళ్ల కలకలం
by సూర్య |
Tue, Aug 20, 2019, 08:04 PM
సికింద్రాబాద్ పోస్టాఫీస్ పార్సిల్ ఆఫీస్ లో రసాయన బాటిళ్ల కలకలం రేగింది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో పేరుతో 50 రసాయన బాటిళ్లు పార్సిల్ ఆఫీస్ కు వచ్చాయి. పోస్టల్ అధికారులు బాటిళ్లను గుర్తించి పోలీసులకు సమాచారమివ్వగా పోలీసులు బాటిళ్లలో రసాయనాలపై ఆరాతీస్తున్నారు. బాటిల్స్ లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లుగా భావిస్తున్న పోలీసులు రసాయనాలను శాంపిల్స్ తీసుకొని ల్యాబ్స్ కు పంపించారు. మరోపక్క ఈ వ్యవహారంపై అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు.
Latest News