రాజధాని అమరావతిపై త్వరలో నిర్ణయం

by సూర్య | Tue, Aug 20, 2019, 07:30 PM


వరదల వల్ల టీడీపీ నేతలకే ఇబ్బందులు తప్ప ఎవరికీ లేవని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు డ్రోన్ల రాజకీయం మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు. ఇల్లు మునగకపోతే చంద్రబాబు హైదరాబాద్‌కు ఎందుకు పారిపోయారు? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అమరావతిలో ముంపు ప్రాంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముంపును అరికట్టాలంటే కాల్వలు, డ్యామ్‌లు నిర్మించాల్సి ఉన్నందున నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని వివరించారు. వరద నీటిని తోడి బయటకు పంపించాల్సి ఉంటుందన్నారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల నిర్వహణపై మంత్రి స్పందించారు. త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ముందుగా పరిషత్‌, తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.


 


 


 


 



Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM