అసెంబ్లీ ఫర్నిచర్ నాదగ్గరే ఉంది : కోడెల

by సూర్య | Tue, Aug 20, 2019, 11:43 AM

టీడీపీ నేత కోడెల శివప్రసాద్ హయాంలో ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్, ఏసీలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందించిన సంగతి తెలిసిందే. అయితే అధికారులు ఇంతవరకూ ఈ వ్యవహారంపై కేసు నమోదుచేయలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ఈ వివాదంపై స్పందించారు. హైదరాబాద్ నుంచి ఏపీ అసెంబ్లీకి సామగ్రిని తరలించేటప్పుడు కొంత ఫర్నీచర్ ను తాను వినియోగించుకున్నానని కోడెల తెలిపారు.


తన దగ్గరున్న ఫర్నీచర్ ను తీసుకెళ్లాల్సిందిగా అసెంబ్లీ అధికారులకు లేఖ కూడా రాశానని ఆయన వెల్లడించారు. కానీ అసెంబ్లీ అధికారులు తన లేఖపై ఇంతవరకూ స్పందించలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు వస్తే ఫర్నీచర్ అప్పగిస్తానని కోడెల స్పష్టం చేశారు.  లేదంటే ఈ ఫర్నీచర్ కోసం ఎంత ఖర్చయిందో చెబితే తాను చెల్లించేందుకు సిద్ధమేనని కోడెల చెప్పారు. 2017, మార్చి నెలలో ఏపీ అసెంబ్లీకి తరలిస్తున్న కొంత ఫర్నీచర్, కొన్ని ఏసీలు మాయం కావడంపై అసెంబ్లీ కార్యదర్శి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసెంబ్లీకి చేరుకున్న పోలీసులు, సామగ్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Latest News

 
భార్యపై అనుమానంతో భర్త దారుణం.. తల్లీపిల్లలను ఇంట్లో ఉంచి.. అసలు మనిషేనా Sat, Apr 20, 2024, 08:00 PM
చంద్రబాబు పుట్టినరోజు.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ Sat, Apr 20, 2024, 07:55 PM
రెండు దొంగ ఓట్లు వేసైనా గెలిపించండి.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్ Sat, Apr 20, 2024, 07:47 PM
చంద్రబాబును అందరూ మర్చిపోయినా, నేను మర్చిపోను: సింగర్ స్మిత Sat, Apr 20, 2024, 07:36 PM
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM