జెసి సృజనకు వీడ్కోలు స‌భ‌లో ప్ర‌శంస‌ల జ‌ల్లు

by సూర్య | Mon, Jun 24, 2019, 05:32 PM

విశాఖపట్నం  సంయుక్త కలెక్టర్ గా పనిచేస్తూ జీవీఎంసీ కమిషనర్ గా బదిలీ అయిన డా. జి. జిల్లా  ఐఏఎస్, రెవెన్యూ, జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన ఈ వీడ్కోలు సభలో వి ఎం ఆర్ డి ఎ వైస్ చైర్మన్ బసంత్ కుమార్, మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత, ధైర్యం ఆమె సొంతం అని కొనియాడారు. విధి నిర్వహణలో ఖచ్చితత్వం, దీక్ష దక్షతల తో ఆదర్శంగా నిలిచారన్నారు. ఏజేసీ వెంకటేశ్వరరావు, మాట్లాడుతూ పనిచేయడంలో, చేయించడంలో చురుకుదనం, సలహాలు ఇవ్వడం తో తాము ఎంతో ధైర్యంగా పని చేశామన్నారు. రెవిన్యూ కి సంబంధించి భూ సమస్యలు ధైర్యంగా పరిష్కరించారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆమె ఉన్నారనే ధైర్యంతో ఎటువంటి లోటు పాట్లు లేకుండా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించగలిగా మన్నారు. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకోవడంలో, వారికి దిశానిర్ధేశం చేయడంలో ఆమె ఎంతో చురుకుగా వ్యవహరించా రన్నారు. ఈ సభలో జిల్లాలోని ఆర్డీవోలు, తాసిల్దార్ లు, విఆర్వోలు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


 


 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM