by సూర్య | Mon, Jun 24, 2019, 04:14 PM
హైదరాబాద్ : ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. హిరోలీ వద్ద ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి డీఆర్జీ(డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హిరోలీ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.
Latest News