by సూర్య | Mon, Jun 24, 2019, 04:12 PM
న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో జయశంకర్ బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో జయశంకర్కు చోటు లభించిన సంగతి తెలిసిందే. జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 1977 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ జయశంకర్.. మోదీ ప్రభుత్వంలో మూడేండ్లు విదేశాంగ శాఖ కార్యదర్శిగా పని చేశారు.
Latest News