ఇది మంచి పద్ధతి కాదు!: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

by సూర్య | Mon, Jun 24, 2019, 01:04 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో టీడీపీ పార్టీ నేతలు ఈరోజు అత్యవసరంగా సమావేశం అయ్యారు. ప్రజావేదిక కూల్చివేత, టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించడం సహా పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీకి పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు హాజరు అయ్యారు. కాగా, ఈరోజు ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటున్న టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురయింది. టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కారును పోలీస్ అధికారులు పలుమార్లు ఆపి తనిఖీలు నిర్వహించారు. దీంతో అసహనానికి లోనైన ఆయన మీడియా ఎదుట తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు. చంద్రబాబు నివాసానికి మేం వెళుతున్నాం. వెళుతుంటే అడుగడుగునా ఆపడం, చెక్ చేయడం చాలా బాధ అనిపించింది. ఇది మంచి పద్ధతి కాదని పోలీస్ వారికి కూడా మేం సూచిస్తున్నాం అని పేర్కొన్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM