పట్టాలు తప్పిన రైలు

by సూర్య | Mon, Jun 24, 2019, 12:11 PM

ఢాకా: రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. కులౌరా ఉపాజిలాలోని బరాంచల్ వద్ద రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వంతెన దాటుతుండగా ఉప్‌బనన్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు 4 బోగీలు పట్టాలు తప్పాయి. వీటిలో రెండు బోగీలు కాలువలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా 150 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM