by సూర్య | Mon, Jun 24, 2019, 12:11 PM
ఢాకా: రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన బంగ్లాదేశ్లో చోటుచేసుకుంది. కులౌరా ఉపాజిలాలోని బరాంచల్ వద్ద రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వంతెన దాటుతుండగా ఉప్బనన్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు 4 బోగీలు పట్టాలు తప్పాయి. వీటిలో రెండు బోగీలు కాలువలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా 150 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Latest News