by సూర్య | Mon, Jun 24, 2019, 12:03 PM
అవినీతిరహిత పాలనే మా ప్రభుత్వ లక్ష్యం. అవినీతిని, దోపిడీని సహించేది లేదు" అని వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవరత్నాల లబ్దిదారుల జాబితాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచాలని, గ్రామ వాలంటీర్లు, పంచాయితీ కార్యాలయాలలో ఈ జాబితాలు ఉంచాలని సూచించారు వీటిలో అర్హులపై ఖచ్చితంగా దృష్టి సారించాలని, అనర్హులు జాబితాలో చోటు దక్కితే వెను వెంటనే అధికారుల దృష్టికి తీసుకు రావటానికి వీలవుతుందని అన్నారు. పారదర్శకతకు నెలవుగా వ్యవస్ధలు మార్చుకోవాలన్నదే తన ప్రయత్నమని, ఇందుకు అధికారులు సహకరించాలని అధికారులకు సూచించారు సిఎం.
Latest News