నల్లా బిల్లును ఎగవేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి

by సూర్య | Mon, Jun 24, 2019, 11:58 AM

గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ నల్లా బిల్లు కట్టడంలేదట. దీంతో, పేరుకుపోయిన బిల్లులు ఏకంగా రూ. 7 లక్షలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఎగవేతదారుల జాబితాలో సీఎం బంగ్లాను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేర్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం. ముంబైలోని మలబార్ హిల్స్ ప్రాంత్రంలో ఫడ్నవిస్ బంగ్లా ఉంది. 2001 నుంచి ఆయన నీటి బిల్లును చెల్లించడం లేదు. ప్రస్తుతం ఆయన పెండింగ్ బిల్లు రూ. 7,44,981కి చేరుకుంది. నల్లా బిల్లు ఎగవేతదారుల్లో ఫడ్నవిస్ తో పాటు మహారాష్ట్ర కీలక నేతలు పంకజా ముండే, రాందాస్ కదమ్, సుధీర్ ముంతివార్ లాంటి 18 మంది ఉన్నారు. వీవీఐపీల పెండింగ్ బిల్లులు రూ. 8 కోట్లకు పైగానే ఉన్నాయట. మరి కొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో... ఈ అంశం రాజకీయ రంగును పులుముకుంది. విపక్షాలు ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలచుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి.

Latest News

 
గుంటూరులో రూ. 7, 62, 850 నగదు సీజ్ Fri, Mar 29, 2024, 08:28 PM
గుడ్ ఫ్రైడే ప్రార్ధనా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రజిని Fri, Mar 29, 2024, 08:27 PM
టీడీపీ తీర్థం పుచ్చుకున్న మల్లెల రాజేష్ నాయుడు, కౌన్సిలర్లు Fri, Mar 29, 2024, 08:25 PM
ఆలయంలో దొంగల బీభత్సం Fri, Mar 29, 2024, 08:22 PM
ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరికొన్ని రైళ్లు పొడిగింపు, పూర్తి వివరాలివే Fri, Mar 29, 2024, 08:11 PM