by సూర్య | Mon, Jun 24, 2019, 11:34 AM
ప్రతి వారం కలెక్టర్లు, జిల్లా అధికారులు గ్రామాలలోని హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేయటంతో పాటు అక్కడే నిద్ర చేసి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సిఎం జగన్ సూచించారు. తద్వారా అక్కడి పిల్లలకు మంచి విద్య అందుతుందా లేదా? మౌళిక వసతులు ఎలా ఉన్నాయో పరిశీలించాలని, అక్కడే స్నాన పానాదులు చేసి గ్రామంలో పర్యటించాలని, ఉదయం 7 గంటలకే నవరత్నాలు అందుతుంది లేనిదీ పరిశీలించాలని సూచించారు. కేవలం హాస్టల్లకే కాకుండా పాఠశాలలు, పిహెచ్సిలపైనా దృష్టి సారించండి, ఆకస్మిక తనిఖీలకు వస్తున్నారంటే ఆయా సంస్ధలలో ఉద్యోగుల పనితీరు మరింత మెరుచుకుంటారని, తద్వారా మార్పు జరుగుతుందని అన్నారు.
Latest News