by సూర్య | Mon, Jun 24, 2019, 11:32 AM
స్పందన - గ్రీవెన్ సెల్ కార్యక్రమం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జరుపాలని సిఎం జగన్ ఆదేశాలిచ్చారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అందే వినతులు తీసుకుని ఖచ్చితంగా రసీదు అందించాలని, మోబైల్ నంబర్ ఇవ్వటంతో పాటు సమస్య పరిస్కారాలకు తగిన సమయం ముందే సూచించాలని తెలిపారు. రసీదుల పై ఇచ్చిన సమస్యల పరిష్కారంలపై కలెక్టర్లు, మండల అధికారులు సైతం పరిశీలించాలని, దీని వల్ల క్రింది స్థాయి అధికారులలో పరిష్కారల వేగం పెరుగుతుందని అన్నారు. త్వరలో తను చేయబోయే రచ్చబండ కార్యక్రమంలో ఈ రసీదులపై సమీక్షిస్తానని చెప్పారు.
Latest News