by సూర్య | Mon, Jun 24, 2019, 11:17 AM
అవినీతి, అక్రమాలకు నెలవైన ప్రజా వేదిక కూల్చేస్తామని ఏపి సిఎం జగన్ చెప్పారు. సోమవారం ఆయన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ గత ప్రభుత్వం పర్యావరణ, నదీ పరివాహక చట్టాలతో సహా అన్నింటినీ తుంగలోకి తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భవనం నిర్మించిందని, ఇలాంటి అక్రమ భవనంలో సమావేశ పెట్టడానికి కారణం ఇందుకు సంబంధించిన వివరాలు చెప్పడానికే నని తేల్చి చెప్పారు. పేద వాడు అక్రమ కట్టడం కడితే కూల్చేసినట్టే, రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారిస్తామని అన్నారు. ఈ క్రమంలో ఈ భవనంలో చేస్తున్న చివరి మీటింగ్ ఇదేనని, ముందుగా ప్రజా వేదిక కూల్చి వేతతోనే ఆరంభించనున్నట్టు చెప్పారు.
Latest News