by సూర్య | Mon, Jun 24, 2019, 12:45 AM
రాష్ట్ర రాజధానిలో అక్రమ నిర్మాణాలను కూల గొడతామంటున్న మీరు వాటిని ఆక్రమించుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని విజయసాయి రెడ్డిని నిలదీసారు టిడిపి నేత బుద్దా వెంకన్న. ఆదివారం ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖలు చేసారు. వైఎస్ హయాంలో జరగిన జలయజ్ఞంలో మహామేత లక్ష కోట్లు మేశార అందుకు ప్రధానసాక్షి ఆడిటర్గా ఉన్న సాయిరెడ్డే అని వ్యాఖ్యానించారు. అవినీతికి సామ్రాట్టు అయిన జగన్తో పాటు ఆయన కూడా ప్రతి శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్తున్నారని నిలదీసారు తమరు రాజ్యసభకు వెళ్లినంత మాత్రాన జగన్..అక్రమాస్తుల కేసు నుంచి తమని తప్పించరని, ఈ కేసులలో తమరు ఏ2 ముద్దయినే అవునో కాదో ఏపి ప్రజలకు చెప్పాలని అన్నారు. ‘‘దొంగలకే దొంగ నువ్వు..దోపిడీ ముఠాలకు నాయకత్వం వహిస్తున్నావని వంటూ విజయసాయిరెడ్డిపై విరుచుకు పడ్డారు. ప్రజావేదిక అక్రమ నిర్మాణమని చెప్పే . విజయమాయరెడ్డి గారు.. దానిని. కలెక్టర్ల సదస్సుకు వాడితే తప్పేంటంటావు. అక్రమాలు చేయాలన్నా..అక్రమాస్తులు కూడబెట్టాలన్నా ఏ1, ఏ2గా మీ రికార్డులు ఎవరూ అందుకోలేనివి వీరప్పన్ గంధపు మొక్కలు పెంపకానికి భూమిని దత్తత తీసుకున్నట్టు ఉంది ’ అని బుద్దా వెంకన్న విమర్శించారు.
Latest News