by సూర్య | Sun, Jun 23, 2019, 09:25 PM
జనసేన పార్టీలో ముఖ్య కమిటీలను ఏర్పాటు చేయనున్నారు పవన్ కళ్యాణ్. కమిటీల సభ్యులు పేర్లను అధికారికంగా రేపు ప్రకటించనున్నారు. ఈ కమిటీల ఏర్పాటుపై కొద్దిరోజులుగా సీనియర్ నాయకులతో చర్చించిన పవన్... ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్పటికే జిల్లాల వారీగా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. కొత్తతరం రాజకీయ వ్యవస్థ రూపకల్పన, పాలకుల్లో జవాబుదారీతనం పెంపొందిస్తామని పవన్ పేర్కొన్నారు. అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో ధృడమైన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి, పార్టీని గ్రామ స్థాయి నుంచి పరిపుష్టం చేయాలనే కృత నిశ్చయంతో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. కొత్త కమిటీలను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో రేపు మధ్యాహ్నం ప్రకటిస్తామని పవన్ తెలిపారు.
పవన్ ప్రకటించబోయే కమిటీల వివరాలు:
పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పి.ఎ.సి.)
లోకల్ బాడీ ఎలక్షన్స్ కమిటీ
క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) మోనిటరింగ్ కమిటీ
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మోనిటరింగ్ కమిటీ
Latest News