by సూర్య | Sun, Jun 23, 2019, 02:19 PM
అమ్మ ఒడి పథకం అందరికీ వర్తిస్తుందని ఏపీ సీఎం కార్యాలయం (సీఎంవో) పేర్కొంది. ఆదివారం అమ్మ ఒడి పథకంపై సీఎం కార్యాలయం ప్రకటన చేసింది. పేద తల్లులు తమ పిల్లలను ఏ బడికి పంపినా అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని పేర్కొంది. ప్రైవేటు స్కూల్ అయినా, ప్రభుత్వ స్కూల్ అయినా అమ్మఒడి వర్తిస్తుందని, పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు అందిస్తామని సీఎంవో తెలిపింది. ఇందులో ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావు లేదని తెలిపింది. అమ్మ ఒడి పథకంపై త్వరలో విధి విధానాలు ప్రకటిస్తామని పేర్కొంది.
Latest News