by సూర్య | Sun, Jun 23, 2019, 02:09 PM
రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్న నరసింహన్ ప్రస్తుతం తన అధికారిక కార్యక్రమాలన్నీ హైదరాబాద్ నుంచే ఇన్నాళ్లు నడిపించేసారు. తాజాగా నవ్యాంధ్రప్రదేశ్లో కొన్నాళ్లు ఉండి అక్కడి వ్యవహారాలు చక్క బెట్టాలనుకున్న గవర్నర్ యోచనలతో ఆతనికి అధికారిక కార్యాలయం, నివాసం కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసారు. ఇందుకు విజయవాడలో ఖాళీగా ఉన్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. నీటి పారుదల శాఖకు చెందిన స్థలంలో విజయవాడ నగర నడిబొడ్డున, స్వరాజ్యమైదానానికి సమీపాన ఉన్న ఈ కార్యాలయ ప్రాంగణం గవర్నర్ కార్యాల యం, అధికారిక నివాసంకు కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ క్యాంప్ కార్యాలయాన్ని రాజ్భవన్గా ఆధునికీకరణ బాధ్యతలను కూడా ప్రభుత్వం సీఆర్డీయేకు అప్పగించినట్లు సమాచారం.
Latest News