by సూర్య | Sun, Jun 23, 2019, 12:45 PM
శ్రీనగర్: ఎదురు కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ రాష్ట్రం సోపియాన్ జిల్లాలోని దరందోరా కీగం ప్రాంతంలో చోటుచేసుకుంది. తీవ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంపై భద్రతా బలగాల సిబ్బంది ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తీవ్రవాదులు భద్రతా బలగాల సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ నేపషథ్యంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మృతిచెందారు. మృతులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనేది గుర్తించాల్సి ఉంది. సంఘటనా స్థలంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Latest News