by సూర్య | Sun, Jun 23, 2019, 11:41 AM
2024 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా జనసేనాని పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే జూన్-23 నుంచి పార్టీ నేతలందరినీ ఆహ్వానించి ప్రత్యేకంగా సమావేశాలు జరుగుపాలని నిర్ణయించారు. ఇటీవల ఎన్నికల ఫలితాల తమకు ప్రతికూలంగా రావటం, సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే పోటీ చేసిన రెండు చోట్ల ఘోర పరాజయం చవిచూడటంతో ఎన్నో ఆశలతో, పదవును ఊహించుకుని పార్టీ చేరిన నేతలో పాటు పలువురు కీలక నేతలు సైతం పార్టీకి రాజీనామా చేసి బయటికెళ్లి పోతుండటం కార్యకర్తలలోనూ ఆందోళన కలిగిస్తోంది. దీంతో అలెర్టయిన పవన్ ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి రాజీనామాలు చేసి వచ్చిన నేతలు తిరిగి జంప్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నారంటూ వస్తున్న వార్తలపైనా స్పందిస్తున్నట్టు సమాచారం. ఇలా పార్టీ మారే అవకాశాలున్న ప్రతినేతతో పవన్ కల్యాణ్.. ప్రత్యేకంగా సమావేశమూ భేటీ అయ్యి బుజ్జగించే ప్రయత్నాలు చేయబోతున్నారని తెలుస్తోంది.
అలాగే పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి పక్కా ప్రణాళికలతో కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించేందుకు అవసరమైన ప్రణాళికలపై నేటి నుంచి జరగనున్న సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు.
Latest News