by సూర్య | Sun, Jun 23, 2019, 11:26 AM
తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’కు తెరలేపి శరవేగంతో నాయకులను చేర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే ఏపిలో టిడిపికి చెందిన రాజ్యసభ సభ్యులను చెంతకు చేర్చుకున్న బిజెపి, అక్కడ కాంగ్రెస్, టిడిపిల కీలకనేతలకు మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణాలో నలుగురు ఎంపీలు గెలవటంతో ఉత్సాహంలో ఉన్న బిజెపి నేతలు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలను కమలం గూటికి రప్పించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, కీలకనేత రాజగోపాల్రెడ్డితో పాటు బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారని వినవస్తోంది. అలాగే కేంద్ర మాజీ మంత్రులు బలరాం నాయక్, సర్వే సత్యనారాయణలతో బిజెపి అధిష్టాన పెద్దలే నేరుగా రంగంలోకి మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈవిషయంపై మీడియా ప్రశ్నలకు బలరాం నాయక్ జవాబిస్తూ, తనని పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ నేతలు సంప్రదించిన మాట వాస్తవమే తను మాత్రం ప్రాణమున్నంతవరకు కాంగ్రెస్లోనే ఉంటానని స్పష్టం చేసారు. అయితే సర్వే సత్యనారాయణ మాత్రం బీజేపీలో చేరేందుకు సుముఖుత వ్యక్తం చేసారని, త్వరలోనే ఢిల్లీ వెళ్లి కాషాయకండువా కప్పుకోనున్నారని సమాచారం.
Latest News