by సూర్య | Sun, Jun 23, 2019, 12:33 AM
అను నిత్యం చంద్ర బాబు మీద, తెలుగుదేశం పార్టీ మీద, వారి కుటుంబసభ్యులు నిర్వహించే వ్యాపారాలపైనా విసుర్లు విసిరే విజయసాయి రెడ్డి దగ్గరుండి మరీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో తులా భారం వేయించారు. శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధ్యక్షుడిగా వైవి సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేసారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో పాటు విజయసాయి రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భం తన మొక్కుబడులను తీర్చుకుంటానన్న సుబ్బారెడ్డి, నిలువెత్తు బరువున్న నేతిని స్వామివారికి ఇవ్వనున్నట్టు చెప్పారు. అంతే ఆఘమేఘాల మీద ఏర్పాట్లు జరిగిపోయాయి. సాయిరెడ్డి దగ్గరుండి మరీ ఈ తులా భారం నిర్వహించారు. అంతా బాగుంది కానీ చైర్మన్ సాబ్ తులతూగింది బాబుగారి హెరిటేజ్ కంపెనీ విషగుళికలు గా రైతు జీవితాలను మర్చేసి డైరీ వ్యవస్థని నీరుకార్చిందని చెప్పుకునే నెయ్యితో. మరి వైసిపి పెద్దలు గమనించారో లేదో?
Latest News