హెరిటేజ్ నేతితో వైవి తులాభారం

by సూర్య | Sun, Jun 23, 2019, 12:33 AM

అను నిత్యం చంద్ర బాబు మీద‌, తెలుగుదేశం పార్టీ మీద‌, వారి కుటుంబ‌స‌భ్యులు నిర్వ‌హించే వ్యాపారాల‌పైనా విసుర్లు విసిరే విజ‌య‌సాయి రెడ్డి ద‌గ్గ‌రుండి మ‌రీ టిటిడి చైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డితో తులా భారం వేయించారు. శ‌నివారం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు అధ్య‌క్షుడిగా వైవి సుబ్బారెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసారు. ఈ వేడుక‌కు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణుల‌తో పాటు విజ‌య‌సాయి రెడ్డి కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భం త‌న మొక్కుబ‌డుల‌ను తీర్చుకుంటాన‌న్న సుబ్బారెడ్డి, నిలువెత్తు బ‌రువున్న నేతిని స్వామివారికి ఇవ్వ‌నున్న‌ట్టు చెప్పారు. అంతే ఆఘ‌మేఘాల మీద ఏర్పాట్లు జ‌రిగిపోయాయి. సాయిరెడ్డి ద‌గ్గరుండి మ‌రీ ఈ తులా భారం నిర్వ‌హించారు. అంతా బాగుంది కానీ  చైర్మ‌న్ సాబ్ తుల‌తూగింది బాబుగారి హెరిటేజ్ కంపెనీ  విష‌గుళిక‌లు గా రైతు జీవితాల‌ను మ‌ర్చేసి డైరీ వ్య‌వ‌స్థ‌ని నీరుకార్చింద‌ని చెప్పుకునే నెయ్యితో.   మ‌రి వైసిపి పెద్ద‌లు గ‌మ‌నించారో లేదో?

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM