by సూర్య | Sat, Jun 22, 2019, 11:54 PM
ఆ మధ్య ఆశీర్వాదాల సందర్భంగా స్వరూపానంద సరస్వతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ పరిసరాలలో భూమిని కేటాయిస్తామని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన ఆ మాట నెరవేర్చకునే క్రమంలో విశాఖ శారదా పీఠానికి రెండెకరాల భూమిని కేటాయించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎకరానికి రూపాయి చొప్పున చెల్లింపుతో . గండిపేట మండలం కోకాపేట పరిధిలో ఉన్న ఈ రెండు ఎకరాల భూమిని కేటాయించారు. శారదా పీఠం ఈ స్థలంలో గురుకుల వేద పాఠశాలను నెలకోల్పనున్న విషయం తెలిసిందే. కాగా కోట్ల విలువ చేసే స్థలం స్వామీజీలకు రూపాయి ఖరీదు కట్టి ధారా దత్తం చేయటంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
Latest News