గుళ్లో పెళ్లి చేసుకుని లాడ్జిలో ఆత్మహత్య!

by సూర్య | Sat, Jun 22, 2019, 10:11 PM

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.గుళ్లో పెళ్లి చేసుకున్నజంట లాడ్జిలో ఆత్మహత్య చేసుకుందిఇక వివరాలలోకి వెళితే... బుట్టాయిగూడెం మండలం నూతిరామన్న పాలెంకు చెందిన నాగంపల్లి శేఖర్ (25), పోలవరం మండలం సరిపల్లికుంటకు చెందిన పోచమ్మ(22) శుక్రవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు.
స్వామి వారిని దర్శించుకున్న ప్రేమజంట.. గుళ్లోనే పెళ్లి చేసుకున్నారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ లాడ్జిలో బసచేశారు. ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందిన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం వారిద్దరూ గదిలోంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు పగులగొట్టి చూడగా.. ప్రేమజంట అపస్మారక స్థితిలో పడుండటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా యువకుడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలేంటని దర్యాప్తు చేపట్టారు.


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM