by సూర్య | Sat, Jun 22, 2019, 09:05 PM
వైసీపీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డికి కీలక పదవి ఇచ్చారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమించారు. విజయసాయిరెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం (జూన్ 22, 2019) ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ భవన్ కార్యాలయంగా విజయసాయిరెడ్డి విధులు నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రభుత్వం తరపున ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన్ రావు ఉన్నారు. ఇటీవలే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
Latest News