by సూర్య | Sat, Jun 22, 2019, 12:11 PM
కర్నూలు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ బిజెపిలో చేరినా తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని చెపుతున్నాడు ఆతని తనయుడు భరత్. ఇటీవల ఎన్నికల్లో భరత్ కర్నూలు నుంచి దేశం అభ్యర్ధిగా బరిలోకి దిగి 4 వేల ఓట్ల తేడాతో ఓటమి చూవిచూసిన విషయం విదితమే. శనివారం ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ తన తం్రడి టీజీ వెంకటేశ్ బీజేపీలోకి వెళ్లినా, తాను మాత్రం టీడీపీనే ఉండాలని నిర్ణయించుకున్నానని, ఈ విషయాన్ని నారా లోకేశ్కు సైతం ఫోన్లో చెప్పినట్టు భరత్ చెప్పారు. తనకు టిక్కెట్ ఇచ్చే విషయంలో చంద్రబాబు ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్న విషయం తనకు తెలుసని, అయినా తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చారని, రాజకీయంగా తనకు పునాదులు వేసిన పార్టీ కష్టసమయంలో ఉన్నప్పుడు తన అవసరం ఎంతైనా ఉంటుందని భావిస్తున్నానని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు విదేశీ పర్యటన నుంచి రాగానే నేరుగా తను కలుస్తానని భరత్ పాత్రికేయులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Latest News