by సూర్య | Sat, Jun 22, 2019, 11:27 AM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం లో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కర్నూలు శాఖ వారి ఆధ్వర్యంలో అంగ రంగ వైభవంగా గోపూజా -కుంకుమ అర్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక్కడి శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో శ్రీ ఆంజనేయస్వామి కి అభిషేకం, పంచామృత అభిషేకం,ఆకు పూజ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం ఆలయ ప్రాంగణంలో గోపూజా కార్యక్రమం నిర్వహించారు.సాయంత్రం గోమాతను మంత్రాలయంలోని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమాలు అన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ,హిందూ ధర్మ ప్రచార పరిషత్ ధన్యవాదాలు తెలిపింది. ఆలయ అర్చకులు, భక్తులు,మహిళలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Latest News