by సూర్య | Sat, Jun 22, 2019, 09:27 AM
ఒలింపిక్ రన్తో సాగరతీరం సందడిగా మారింది. ఎక్కడా లేని విశాఖలో 21 కిలోమీటర్లు ఉన్న ఈ సముద్రపు ఒడ్డుశనివారం ఉదయం నిర్వహించిన మారథాన్ రన్లో పాల్గొన్న యువత, స్థానికులు. ఇంజనీరింగ్ , వైద్య కళాశాలల విద్యర్ధులతోపాటు నగరంలోని అనేక కళాశాలల విద్యర్ధులు , అధికారులు పాల్గొని ఆడుతూ, పాడుతూ అందరినీ ఉత్సాహ పరిచారు. ఒలింపిక్స్ డే సందర్భంగా ఆర్కే బీచ్ రోడ్ లో ఆరంభమైన ఈ ఒలింపిక్ రన్ ను ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు గణబాబు .ఎండా వూపి ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పిల్లల మానసిక పరిణితికి ఆటలు చాలా అవసరమని తలిదండ్రులు కూడా స్పోర్ట్స్పై పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు, చెప్పారు. కొత్త ప్రభుత్వం క్రీడలపై గత ప్రభుత్వ తరహాలోనే ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రన్ బీచ్ రోడ్ కాళీ మాత ఆలయం నుంచి వైఎంసీ హాల్ వరకూ నిర్వహించారు.
Latest News