by సూర్య | Sat, Jun 22, 2019, 09:13 AM
తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి 300 మందికి పైగా నాయకులు వెళ్లిపోయినా... కార్యకర్తలు మాత్రం టీడీపీకి అండగా ఉన్నారని, వారి వల్లే పార్టీ నడుస్తోందని అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, శనివారం శ్రీవారి దర్శనార్ధం తిరుమల వచ్చిన ఆయన కాసేపు మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఓటమికి కారణాలేంటో అర్థం కావడంలేదని,. ఎన్నికల ఫలితాలపై విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. తాజాగా పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిపోవటంపై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి సంక్షోభం కొత్తేమీకాదని , వీటిని ఎదుర్కొన గలిగే సత్తా తమ పార్టీకి ఉందని డొక్క వ్యాఖ్యానించారు.
Latest News