by సూర్య | Sat, Jun 22, 2019, 07:44 AM
శ్రీవారు జన్మించిన శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మూడు అన్నమయ్య సంకీర్తనల సిడిలను ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు. టిటిడి ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ఇందులో అన్నమయ్య సంకీర్తన సుశామ, అన్నమయ్య పద సుధార్ణవం, అన్నమయ్య పద సురభిలం అనే సిడిలున్నాయి. వీటిలోని సంకీర్తనలను టిటిడి ఆస్థాన గాయకులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ స్వరపరిచారు. బాలకృష్ణప్రసాద్తోపాటు ఆర్.బుల్లెమ్మ, జివిఎన్.అనిల కుమార్ ఆలపించారు. ఈ సందర్భంగా గాయకులను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వారు ఈ సంకీర్తనలను పాడి వినిపించారు.
Latest News