by సూర్య | Fri, Jun 21, 2019, 08:42 PM
ఏపీలోని 13 జిల్లాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంచార్జ్ మంత్రులను నియమించారు. శుక్రవారం ఈ జాబితాను పార్టీ పెద్దలు అధికారికంగా విడుదల చేశారు. ఇకపై ఈ మంత్రులంతా ఆయా జిల్లాల అభివృద్ధితో పాటు నేతల మధ్య సమన్వయంతో పాటు అన్ని కార్యక్రమాలు వీళ్లే చూసుకోనున్నారు. జిల్లాల వారిగా చూస్తే శ్రీకాకుళం - వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరం - చేరుకువాడ శ్రీరంగనాధరాజు, విశాఖపట్నం - మోపిదేవి వెంకటరమణ, తూర్పుగోదావరి - ఆళ్ల నాని, పశ్చిమగోదావరి - పిల్లి సుభాష్ చంద్రబోస్, కృష్ణా - కన్నబాబు, గుంటూరు - పేర్ని నాని, ప్రకాశం - అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు - సుచరిత, కర్నూలు - బొత్స సత్యనారాయణ, కడప - బుగ్గన రాజేంద్రనాధ్, అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు - మేకపాటి గౌతమ్ రెడ్డిలను నియమించారు.
Latest News