by సూర్య | Fri, Jun 21, 2019, 03:18 PM
చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలో నీటి కోసం ప్రజలు కటకటలాడిపోతున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నీటి సమస్యపై మాట్లాడుతూ చెన్నైలో నీటి సరఫరా చేసే నాలుగు చెరువులు ఎండిపోయాయని చెప్పారు. ప్రస్తుతం మెట్రో వాటర్ విభాగం ద్వారా 525 ఎంఎల్డి నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. జోలార్పెట్టాయ్నుంచి రైళ్ల ద్వారా నీటిని తీసుకుని వచ్చి సరఫరా చేస్తామని ఆయన అన్నారు. రుతు పవనాలు రాకపోవడం వల్లే నీటి సమస్య ఉత్పన్నమైందని ఆయన అన్నారు.
Latest News